Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అమరావతి రాజధానికి మరోసారి భూ సమీకరణ

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 14, 2025, 10:01 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమరావతి రాజధానికి మరోసారి భూమి సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న పెదపరిమి, హరిశ్చంద్రాపురం, మోతడక గ్రామాల రైతులు తమ భూములు కూడా రాజధానికి తీసుకోవాలని పురపాలక మంత్రి నారాయణకు వినతులు ఇచ్చారు. రాజధాని అవసరాలకు ఇప్పటికే సేకరించిన 35 వేల ఎకరాలు చాలకపోవడంతో పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు భూ కేటాయింపులు చేయలేకపోతున్నారు. దీంతో మరో 42 వేల ఎకరాల భూమి సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే విద్య,వైద్య, పర్యాటక, పరిశోధనా సంస్థలకు భూ కేటాయింపులు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం వద్ద కేవలం 2 వేల ఎకరాలు మాత్రమే ఉండటం… అందులో 1500 ఎకరాలకు సంబంధించిన కేసు హైకోర్టులో ఉండటంతో భూ కేటాయింపులు నిలిచిపోయాయి. బిట్స్, ఎక్స్‌ఎల్‌ఆర్ సంస్థలు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు పెట్టేందుకు ముందుకు వచ్చినా ప్రభుత్వం భూమి కేటాయించలేకపోతోంది. దీంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అమరావతి సమీప గ్రామాలతోపాటు, అవుటర్, ఇన్నర్ రింగు రోడ్డు సమీప గ్రామాల్లోనూ ప్రభుత్వం భూసమీకరణ చేసే అవకాశముంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులతోపాటు, అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇన్నర్ రింగు రోడ్డుకు 1300 ఎకరాలు, అవుటర్ రింగు రోడ్డుకు 3 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాల కోసమే దాదాపు 8 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇక ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున భూమి అవసరం ఉంది.

తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి మండలాలతోపాటు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే గ్రామాల్లో భూసమీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చిన గ్రామాల్లో ముందుగా భూసమీకరణ చేయనున్నారు. ఆ తరవాత ఇన్నర్, అవుటర్ రింగు రోడ్లకు భూసేకరణ చేయనున్నారు. ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు కనీసం 42 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా. ఇందుకు అనుగుణంగా మరోసారి భూసమీకరణకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Tags: AmaravathiAMARAVATIamaravati landsandhratodaynewsAP Capitalap capital amaravathiap capital constructionap capital land poolingcapital amaravathicapital Amaravatiland acquisitionland poolingSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.