Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

90 రోజుల ఊరట : ట్రంప్ పెంచిన సుంకాల అమలు 3 నెలలు వాయిదా

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 10, 2025, 09:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పరస్పర సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతించారు. పెంచిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే చైనాపై పెంచిన సుంకాలు తగ్గించకపోగా మరింత పెంచారు. మరో మూడు నెలల పాటు మిగిలిన దేశాల్లో పాత టారిఫ్ 10 శాతం అమలు చేయనున్నారు.

చైనాపై ట్రంప్ మరోసారి సుంకాలు పెంచారు. దీంతో చైనాపై 125 శాతం సుంకం విధించినట్లైంది. చైనా కూడా దీటుగా బదులిచ్చింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించింది. కెనడా, ఐరోపా దేశాలు కూడా సుంకాలను పెంచాయి. పలు దేశాలు సుంకాల విషయంలో సంప్రదింపులకు రావడంతో 90 రోజులు అమలు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమైన నేపథ్యంలోనే సుంకాల పెంపు అమలు వాయిదా వేయాలనే ప్రచారం జరుగుతోంది.

చైనాలో అమెరికా 34 శాతం సుంకాలను ప్రకటించింది. గతంలో అప్పటికే అమల్లో ఉన్న సుంకాలతో కలపి 54 శాతానికి చేరింది. ప్రతీకారంగా అమెరికాపై చైనా 34 శాతం సుంకాలను పెంచింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. చైనా వెనక్కు తగ్గకపోతే అదనంగా 50 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా వెనక్కు తగ్గలేదు. బుధవారంనాడు 50 శాతం సుంకాలను విధించడంతో మొత్తం 104 శాతానికి చేరింది. బుధవారం సాయంత్రానికి అది 125 శాతానికి పెంచారు.

అమెరికా చర్యలను తీవ్రంగా తీసుకున్న చైనా వెంటనే 50 శాతం పరస్పర సుంకాలను వేసింది. గతంలో ఉన్న 34 శాతం కలుపుకుంటే మొత్తం 84 శాతానికి చేరింది. గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చైనా ప్రకటించింది. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేస్తామని చైనా హెచ్చరించింది.

ప్రపంచ దేశాలపై పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ మొదటగా ప్రకటించారు. తరవాత 90 రోజులు వాయిదా వేశారు. తాజాగా చైనాలో 125 శాతం, భారత్‌పై 26 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. బుధవారం సాయంత్రానికే ట్రంప్ నిర్ణయం మార్చుకోవడంతో సుంకాల పెంపు అమలు 90 రోజులు వాయిదా పడింది.

ఔషధాలపై కూడా త్వరలో సుంకాలు వేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి ఔషధాలు అమెరికాలోనే తయారవుతాయన్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకాలను విధించింది. అమెరికా, కెనడా ఒప్పందాన్ని గౌరవించని కారణంగానే తాజాగా సుంకాలను పెంచినట్లు కెనడా ప్రకటించింది. పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ ప్రకటించారు.

Tags: andhratodaynewsdonald trumpSLIDERtariff wartariffsTOP NEWStrade wartrumptrump tariff threattrump tariff wartrump tariffstrump tariffs newstrump trade warus china tariffs
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.