Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

జేకే ఉగ్ర సంఘటనల్లో జనవరిలో మూడే మరణాలు: గత 20ఏళ్ళ కనిష్ఠ స్థాయి

Phaneendra by Phaneendra
Feb 6, 2025, 10:55 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈ యేడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింసలో మొత్తం 31 రోజులకు గానూ 3 మరణాలే నమోదయ్యాయి. గత ఇరవై ఏళ్ళలో ఏదైనా ఒక నెలలో ఇంత తక్కువ హింస జరగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం జమ్మూ ప్రాంతం పూంఛ్ జిల్లాలో, భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అంతకు ముందు వారంలో కశ్మీర్‌ ప్రాంతంలోని సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ఒక జవాను అమరుడయ్యారు.   

జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అంతటా భద్రతా బలగాల పహరా పెంచడం, ఇంటలిజెన్స్ నెట్‌వర్క్ మెరుగు పడడమే ఈ ఘనతకు కారణాలయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అతితక్కువ మరణాలు నమోదైన నెల అని భారత సైన్యానికి చెందిన ఒక అధికారి వెల్లడించారు. గతేడాది జనవరిలో కూడా ముగ్గురే మరణించారు. వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన వారు, ఒక ఉగ్రవాది. ఇప్పుడా పరిస్థితి తిరగబడింది పైగా, మృతుల్లో సాధారణ భారతీయ పౌరులు ఎవరూ లేకపోవడం విశేషం. గత ఐదేళ్ళ అధికారిక సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ యేడాదిలోనూ జనవరి నెలలో సామాన్య పౌరులు చనిపోలేదు.

పౌరుల మరణాలు గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం, భారతీయ భద్రతా బలగాలు పెద్దసంఖ్యలో మోహరించిన మారుమూల ప్రాంతాలకు ఉగ్రవాదులను తరిమికొట్టడమే అని ఆర్మీ అధికారి చెప్పారు. అంతేకాదు, 2017 నుంచీ సమాచారాన్ని గణిస్తే, ఉగ్రవాదులను హతమారుస్తున్న సంఘటనలే అధికంగా ఉండడం, ఒక స్పష్టమైన విధానాన్ని ప్రజలకు చూపిస్తోందని ఆ అధికారి చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో భద్రతా నిఘా పెంచడం వల్ల అక్కడ శాంతిభద్రతల పరిస్థితి నిలకడగా ఉందని ఓ భద్రతా అధికారి వెల్లడించారు. ఎలాంటి ఎన్‌కౌంటర్‌లోనూ సామాన్య పౌరులు లేదా భద్రతా బలగాలూ ప్రాణాలు కోల్పోకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్లు చేపట్టడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. జమ్మూకశ్మీర్‌ను ఉగ్రవాద విముక్త ప్రాంతంగా మార్చడానికి అన్నిరకాల వనరులనూ అందిస్తామని వెల్లడించింది. సరిహద్దుల వెంబడి సీసీ కెమెరాలతో నిఘా, డ్రోన్ జామర్ల వినియోగం వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం కూడా సత్ఫలితాలను ఇస్తోందని భారత సైన్యపు అధికారి ఒకరు స్పష్టం చేసారు.

Tags: Government of IndiaJammu KashmirLowest FatalitiesLowest Toll in Two DecadesTerrorist AttacksTOP NEWSUnion Home Ministry
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.