Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ఎర్రకోట మాదే, ఇచ్చేయాలన్న మొగల్ వంశీకురాలు, కుదరదన్న కోర్టు

Phaneendra by Phaneendra
Dec 14, 2024, 10:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఢిల్లీ హైకోర్టు నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన కేసు కొట్టేసింది. ఎర్రకోట మా సొంతం, దాన్ని మాకు తిరిగి ఇచ్చేయాలంటూ మొగల్ నవాబుల వారసురాలు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

ఆఖరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 2 మునిమనవడి భార్య సుల్తానా బేగమ్. ఎర్రకోటకు అసలైన వారసురాలిని తనే అని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1857లో బలవంతంగా తమ పూర్వీకుల నుంచి ఆ కోటను లాగేసుకుందని, ఇప్పుడు భారత ప్రభుత్వం ఆ కోటను అక్రమంగా ఆక్రమించిందనీ సుల్తానా బేగమ్ వాదన. తన కోటను తనకు ఇప్పించాలనీ, లేనిపక్షంలో కనీసం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలనీ ఢిల్లీ హైకోర్టులో సుల్తానా పిటిషన్ వేసింది.

మొదట, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్‌కు కాలదోషం పట్టిందంటూ కొట్టేసారు. ఎప్పుడో 167ఏళ్ళ క్రితం చేతులు మారిన కోటను ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసారు. ఆమేరకు 2021 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈమధ్య సుల్తానా బేగమ్ మళ్ళీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.   

ప్రధాన న్యాయమూర్తి విభూ భాక్రూ, జస్టిస్ గేదెల తుషార్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ తాజా పిటిషన్‌ను సైతం డిస్మిస్ చేసారు. తాజా పిటిషన్ సైతం రెండున్నరేళ్ళు ఆలస్యంగా దాఖలు చేసారన్న కారణంతో సుల్తానా ఇటీవల చేసుకున్న అప్పీలును కొట్టేసారు.  

సుల్తానా తరఫున కేసు పెట్టిన అడ్వొకేట్ వివేక్ మోరే తన వాదనల్లో భాగంగా భారత ప్రభుత్వం ఎర్రకోటను అక్రమంగా ఆక్రమించిందని ఆరోపించారు. 1857 నుంచి ఇప్పటివరకూ అక్రమ ఆక్రమణకు భారత ప్రభుత్వంతో నష్టపరిహారం ఇప్పించాలని సుల్తానా హైకోర్టును కోరారు.

ఎర్రకోటను మొగల్ రాజు షాజహాన్ నిర్మింపజేసాడు. దేశ రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చినపుడు ఆ కోట నిర్మాణం జరిగింది. నాదిర్‌షా ఆక్రమణ సమయంలో ఎర్రకోటలోని నెమలి సింహాసనం సహా అమూల్యమైన కళాఖండాలు, అద్భుతమైన ఆభరణాలూ దేశం వదిలి తరలిపోయాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత బ్రిటిష్ పాలకులు ఎర్రకోటను సైనిక స్థావరంగా వాడుకున్నారు. వారు ఎర్రకోటలోని 80శాతానికి పైగా నిర్మాణాలను, మొత్తం ఫర్నిచర్‌నూ తొలగించివేసారు. సైన్యం కోసం రాళ్ళతో బ్యారక్‌లు కట్టారు. కోటలోని ఫర్నిచర్‌ను, కళాఖండాలనూ ఇంగ్లండ్ తరలించివేసారు.

దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా ఎర్రకోటను మిలటరీ బేస్‌గానే ఉపయోగించారు. 2003లో వాజ్‌పేయీ హయాంలో ఎర్రకోట పునరుద్ధరణ, పరిరక్షణ బాధ్యతలను భారత పురావస్తు సంర్వేక్షణ సంస్థకు (ఎఎస్ఐ) అప్పగించారు.

Tags: Delhi High CourtMughal DescendantOwnership ClaimRed FortSLIDERSultana BegumTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.