Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు: సీబీఐ విచారణకు డిమాండ్

కేంద్ర హోంశాఖ వివరణ కోరిన అలహాబాద్ హైకోర్టు

Phaneendra by Phaneendra
Dec 3, 2024, 04:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న వార్తలు దేశంలో రాజకీయ వివాదానికి దారి తీసాయి. రాహుల్‌కు ఇంగ్లండ్‌లోనూ పౌరసత్వం ఉందని, దాన్ని రద్దు చేయాలనీ కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం నమోదయింది. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖను న్యాయస్థానం కోరింది.

 

పిటిషన్-ఆరోపణలు:

కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. రాహుల్ గాంధీ ఇంగ్లండ్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. అదే నిజమైతే భారతదేశ చట్టాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వ పదవి చేపట్టడానికీ రాహుల్ గాంధీ అనర్హుడవుతారు. రాహుల్ ద్వంద్వపౌరసత్వం భారత పౌరసత్వ చట్టం 1955, పాస్‌పోర్ట్ చట్టం, భారతీయ న్యాయసంహితల్లోని పలు అంశాలను ఉల్లంఘిస్తోందని శిశిర్ వాదన.

శిశిర్ తన పిటిషన్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, ఆయన పౌరసత్వం వ్యవహారంమీద సిబిఐతో దర్యాప్తు జరిపించాలనీ డిమాండ్ చేసారు. అంతేకాదు, ఆ వ్యవహారానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఇద్దరికీ ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

 

ప్రభుత్వ స్పందన, కోర్టు మార్గదర్శకాలు:

ఆ పిటిషన్‌కు స్పందనగా కేంద్ర హోంశాఖ, ఆ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని న్యాయస్థానానికి తెలియజేసింది. రాహుల్ ద్వంద్వ పౌరసత్వం గురించి కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ వచ్చిందని, దానిపై దర్యాప్తు మొదలైందనీ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ చెప్పారు. దానిపై తదుపరి విచారణ డిసెంబర్ 19న జరుగుతుంది. అప్పటికల్లా కేంద్రం కనుగొన్న సమాచారాన్ని సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు న్యాయస్థానం సూచించింది.

తమ దేశపు పౌరుల రికార్డులలో రాహుల్ గాంధీ పేరు ఉందని ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి  సాక్ష్యం ఉందని శిశిర్ చెబుతున్నారు. భారత చట్టాల ప్రకారం, విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే భారత పౌరసత్వం దానంతట అదే రద్దయిపోతుందని గుర్తు చేసారు.  

 

ఢిల్లీ హైకోర్టులోనూ ఇలాంటి కేసే:

ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇటువంటి కేసే ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరుగుతోంది. అక్కడ, రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసారు. ఇంగ్లండ్ కేంద్రంగా పనిచేసే ఒక కంపెనీ డాక్యుమెంట్లలో రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నారన్నది ఆయన వాదన.

ఢిల్లీ హైకోర్టు విచారణలో భాగంగా, తన కేసు అలహాబాద్ హైకోర్టులో ఉన్న కేసు వేర్వేరు అని సుబ్రమణ్యస్వామి చెప్పారు. తన పిటిషన్‌లో కేవలం రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి మాత్రమే దృష్టి పెట్టామని, క్రిమినల్ ప్రోసిక్యూషన్ కోరడం లేదనీ ఆయన వివరించారు. అయితే స్వామి కేసు వల్ల రెండు కోర్టుల్లో సమాంతరంగా ఒకే ప్రొసీడింగ్స్ జరుగుతాయనీ, వృధా శ్రమ జరుగుతుందనీ, ఇప్పటికే సాక్ష్యాలను సిబిఐకి అందజేసామనీ శిశిర్ న్యాయవాదులు వాదించారు. అలహాబాద్ హైకోర్టులో కేసు అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉందని ఢిల్లీ హైకోర్టు బెంచ్ గమనించింది. పరస్పర విరుద్ధమైన ఆదేశాలు రాకుండా ఉండడం ముఖ్యమని ఢిల్లీ హైకోర్ట్ బెంచ్ వ్యాఖ్యానించింది.

 

ద్వంద్వ పౌరసత్వం – భారత చట్టాలు:

భారత చట్టాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించవు. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం, ఒక వ్యక్తి విదేశీ జాతీయతను పొందిన వెంటనే సహజంగా భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు. అటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వం మీద వివాదం చాలాయేళ్ళుగా నలుగుతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇంగ్లండ్ కేంద్రంగా పనిచేసి (ఇప్పుడు ఉనికిలో లేని) ఒక కంపెనీ కోసం డాక్యుమెంట్లు ఫైల్ చేసే సమయంలో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నారన్న వాదనలు ఉన్నాయి.  

రాహుల్ యూకే పౌరసత్వం గురించి వివరాలను డిసెంబర్ 19న సమర్పించాలంటూ కేంద్రాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ విచారణార్హతపై ఢిల్లీ హైకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు హోంశాఖ ఇవ్వబోయే వివరణ రాహుల్ గాంధీ మీద వస్తున్న ఆరోపణల సంబద్ధతను, ఆయన రాజకీయ భవిష్యత్తునూ నిర్ణయించడంలో కీలకంగా నిలుస్తుంది.

Tags: Allahabad High Courtandhra today newsDelhi High CourtDual Citizenship AllegationsRahul GandhiSLIDERTOP NEWSUK Citizenship
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.