Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ బలగాల గస్తీ మొదలు

Phaneendra by Phaneendra
Nov 1, 2024, 05:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా దేశాలు తమ సైనిక దళాలను వెనక్కు తీసుకున్న తర్వాత, దెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల ‘సమన్వయ గస్తీ’ మొదలైంది. సమన్వయ గస్తీ అంటే రెండు వైపులా గస్తీ గురించి ఇరుదేశాలూ పరస్పరం సమాచారం పంచుకుంటాయి.

దెమ్‌చోక్ సెక్టార్‌లో గస్తీ తిరగడం ఇవాళ్టి నుంచి మొదలుపెట్టామని, దెప్సాంగ్ సెక్టార్‌లో కూడా మన గస్తీ త్వరలోనే మొదలవుతుందని భారత సైన్యం వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాల మోహరింపును వెనక్కి తీసుకోడానికి ఇరుదేశాలూ అంగీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

నిన్న గురువారం నాడు దీపావళి సందర్భంగా లద్దాఖ్ సెక్టార్‌లోని వివిధ సరిహద్దు పాయింట్ల దగ్గర ఇరుదేశాల సైనికులూ తీపిపదార్ధాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హాట్ స్ప్రింగ్స్, కారకోరం కనుమ, దౌలత్ బేగ్ ఓల్డీ, కోంక్‌లా, చుషూల్-మోల్డో వంటి సరిహద్దు ప్రాంతాల దగ్గర సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.   

ఈ పరిణామాలను లద్దాఖ్ ఎంపీ హాజీ హనీఫా స్వాగతించారు. ‘‘యుద్ధం ఎలా ఉంటుందో సరిహద్దుల దగ్గర నివసించే మాలాంటి వారికి బాగా తెలుసు. సరిహద్దుల వెంబడి శాంతిగా ఉండడమే మాకు కావాలి. రెండు దేశాల మధ్యా ఒప్పందం కుదరడాన్ని మేం స్వాగతిస్తున్నాం. సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు దౌత్య చర్చల ద్వారా పరిష్కారం కావాలి’’ అని ఆయన అన్నారు.

భారత సైనిక దళాధిపతి ఉపేంద్ర ద్వివేదీ ఈ అంశం గురించి మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ సరిహద్దుల వద్ద 2020 ఏప్రిల్ నాటి యథాతథ స్థితిని, పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం క్రమక్రమంగా జరుగుతుందని చెప్పారు. ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలను తొలగించడానికి… వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ అంగీకరించిన సరిహద్దుల దగ్గర బలగాలు వెనక్కి తగ్గడం, వాటి ఉపసంహరణ, బఫర్ జోన్ నిర్వహణ అనేవి కీలకమైన చర్యలని, అవి దశల వారీగా ఒకటొకటిగా అమలవుతాయనీ వెల్లడించారు.    

తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత చైనా సరిహద్దుల వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు 2020 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. చైనా సైన్యం హద్దులు దాటి భారత భూభాగం వైపు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో ఆ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల సంబంధాలనూ తీవ్రంగా ప్రభావితం చేసాయి.

Tags: andhra today newsDemchok SectorDepsang SectorEastern LadakhIndia-China DisengagementIndian Army TroopsLine of Actual ControlPatrolling at LACSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.