Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి: 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ళ పూలతో అలంకరణ

Phaneendra by Phaneendra
Oct 29, 2024, 01:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అయోధ్యలోని బాలరాముడి నూతన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి దీపావళి జరగబోతోంది. ఆ పర్వదినాన్ని చిరస్మరణీయంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. 28 లక్షల దీపాలు వెలిగించడానికి, 50 క్వింటాళ్ళ పువ్వులతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రావణ సంహారానంతరం రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి పండుగ జరుపుకోవడం ఉత్తర భారతదేశంలో ఒక ఆనవాయితీ. అందుకే ఈ యేడాది దీపావళి అయోధ్యలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ విశేష సందర్భం కోసం ప్రత్యేకమైన దీపాలు సిద్ధమవుతున్నాయి. ఆలయం ఆవరణ అంతా చాలాసేపు వెలుగులీనేలా దీపాలు అమర్చబోతున్నారు.   

గుడిలోనూ, చుట్టుపక్కలా దీపాల అలంకరణను పర్యవేక్షించే బాధ్యతను ఒక విశ్రాంత ఐజీకి అప్పగించారు. ఆలయం ఆవరణను కొన్ని భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగంలోనూ దీపాలు వెలిగించడం, పరిశుభ్రత, అలంకరణ బాధ్యతలను ఒక్కో బృందం చేపడుతుంది.

రామమందిరం సుందరీకరణ బాధ్యతను బిహార్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐజీ అషూ శుక్లా స్వీకరించారు. అన్ని ద్వారాలనూ తోరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు.

ఆలయ ఆవరణలో నూనె మరకలు పడకుండా, పొగ చూరకుండా చూడడం కోసం మైనపు దీపాలు వాడాలని నిర్ణయించారు. ఎక్కువ సమయం, ఎక్కువ కాంతివంతంగా, తక్కువ కర్బన ఉద్గారాలతో వెలిగే దీపాలను మందిరం ఆవరణ అంతటా వెలిగిస్తారు. ఇవాళ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1 వరకూ మందిరంలో జరిగే అలంకరణలను భక్తులు దర్శించుకోవచ్చునని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

రామమందిరాన్ని అలంకరించడానికి 50 క్వింటాళ్ళ పువ్వులు వాడుతున్నారు. ఆలయం నాలుగు ప్రవేశద్వారాల దగ్గరా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుంది.  

ఈ యేడాది అయోధ్యలోని సరయూ నదీ తీరం వెంబడి ఉన్న మొత్తం 55 ఘట్టాలనూ 20లక్షలకు పైగా దీపాలతో వెలిగించడానికి అన్ని యేర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తంగా ఈ దీపావళి పర్వదినాన అయోధ్య 25లక్షలకు పైగా దీపాల వెలుగులతో మెరిసిపోయే దీపోత్సవం జరుపుకుంటుంది.

ఘాట్ అలంకరణలు 95శాతం పూర్తయ్యాయి. ఈ యేడాది దీపోత్సవంలో పదివేల మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ‘రామ్‌ కీ పైడీ’ దగ్గర వీక్షకుల కోసం గ్యాలరీ నిర్మాణం పూర్తయింది.

Tags: andhra today newsAyodhyaDeepawaliDeepotsavRam LallaRam MandirSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.