Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించాల్సిందే: హిందూ సంఘాల ఆందోళన

Phaneendra by Phaneendra
Sep 11, 2024, 01:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఇవాళ హిందూ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నగరంలోని సంజౌలీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదు కారణంగా కొన్నాళ్ళుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంఘాల ఆందోళన పిలుపుతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించాయి.

సంజౌలీలోని మసీదు చుట్టుపక్కలే కాకుండా ఆ ప్రాంతం అంతటా పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసారు. ధాలీ సొరంగం దగ్గర రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు.

జిల్లా కమిషనర్ అనుపమ్ కాశ్యప్ సంజౌలీలో ఈ ఉదయం 7గంటల నుంచి అర్ధరాత్రి వరకూ పరిమిత కర్ఫ్యూ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా నిన్న రాత్రి పోలీసులు ఆ ప్రాంతంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.

‘‘సాధారణ జనజీవితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బడులు, మార్కెట్లు తెరిచే ఉంటాయి. ఎవరూ ఆందోళన చేయడానికి అనుమతి లేదు. లౌడ్‌స్పీకర్లు పెట్టడాన్ని నిషేధించాం’’ అని కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

సంజౌలీ ప్రాంతంలోని మసీదు వివాదానికి చాలా చరిత్ర ఉంది. దేశానికి స్వతంత్రం రాకముందునుంచే ఆ వివాదం నడుస్తోంది. అప్పట్లో తాత్కాలిక నిర్మాణం మాత్రమే ఉండేది. 2010లో మసీదు శాశ్వత భవనం నిర్మాణం మొదలైంది. అప్పుడే స్థానిక ప్రజలు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసారు. అప్పటినుంచీ ఆ వ్యవహారంపై మునిసిపల్ కార్పొరేషన్ కోర్టులో దావా నడుస్తూనే ఉంది. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ అక్కడ ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ఆ నిర్మాణం ఈ యేడాదే పూర్తయింది.

సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ అధికారిక రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాన్ని అంతటితో నిలిపివేయాలంటూ కార్పొరేషన్ మొత్తం 35సార్లు ఆదేశాలు జారీ చేసింది. 2023లో మసీదులో భాగంగా నిర్మించిన టాయిలెట్లను మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేసింది. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆగస్టు చివరి వారంలో ఒక దాడి సంఘటన చోటు చేసుకుంది. దాంతో హిందూ సంఘాలు సెప్టెంబర్ 1న సంజౌలీలోనూ, సెప్టెంబర్ 5న చౌరా మౌదాన్‌లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

సెప్టెంబర్ 7న ఆ కేసుకు సంబంధించి మునిసిపల్ కమిషనర్ కోర్టులో 45వ విచారణ జరిగింది. మసీదు ఉన్న స్థలం తమదేనంటూ స్థానిక వక్ఫ్ బోర్డు కొన్ని పత్రాలు కోర్టుకు సమర్పించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఆలోగా వివాదాస్పద నిర్మాణం వద్ద తాజా పరిస్థితి గురించి నివేదిక సమర్పించమని జూనియర్ ఇంజనీర్‌ను కోర్టు ఆదేశించింది.

మసీదు ఇమామ్ షహజాద్ మసీదు ఉన్న ప్రదేశం తమదేనంటూ సమర్ధించుకున్నారు. ‘‘1947లో తాత్కాలికంగా నిర్మించిన రెండంతస్తుల భవనంలో మసీదు ఉండేది. అది తాత్కాలిక మసీదు కావడంతో ప్రజలు బైటే నమాజు చేసుకునేవారు. ఆ ఇబ్బందులను గుర్తించి ప్రజలే విరాళాలు సేకరించారు. అప్పుడు మసీదు నిర్మాణం మొదలైంది. ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది. మసీదులోని రెండు అంతస్తుల గురించి వక్ఫ్ బోర్డు న్యాయపోరాటం చేస్తోంది. కోర్టు తీర్పును అందరమూ ఒప్పుకుంటాము’’ అని ఇమామ్ చెప్పుకొచ్చారు.

ఉద్రిక్తతలు పెరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖూ ప్రకటించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసుకోడంపై ఆంక్షలేమీ లేవు. మేం అన్ని మతాలనూ గౌరవిస్తాం, కానీ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోడానికి ఎవరినీ అనుమతించం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దు’’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

Tags: andhra today newsHimachal PradeshHindu Organizations ProtestIllegal Mosque ConstructionSanjauliShimlaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.