Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా ఆస్పత్రిలో భారీ మార్పులు

Phaneendra by Phaneendra
Aug 22, 2024, 12:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచార ఘటన తర్వాత మెడికోల ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆస్పత్రి యాజమాన్య విధులు నిర్వహించే టాప్ పోస్టుల్లో పలు మార్పులు చేసింది.

అత్యాచార ఘటన తర్వాత డాక్టర్ సందీప్ ఘోష్‌ను ప్రిన్సిపాల్‌ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నియమించిన డాక్టర్ సుహృతా పాల్‌ను కూడా తప్పించి తాజాగా డాక్టర్ మానస్‌ కుమార్ బందోపాధ్యాయను కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆయన అంతకుముందు ప్రిన్సిపాల్‌గా ఉన్న బరాసాత్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి సుహృతా పాల్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించారు.

ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్ డాక్టర్ బుల్‌బుల్ ముఖోపాధ్యాయను తొలగించి, ప్రొఫెసర్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీని నియమించారు.

ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్‌లో ఛాతీ చికిత్స విభాగం హెడ్‌గా ప్రొఫెసర్ డాక్టర్ అరుణాభ దత్తా చౌధురిని తొలగించారు. హత్యాచార బాధితురాలు ఆ విభాగంలోనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రయినీగా ఉండేది.

బుధవారం ఆర్.జి.కర్ కళాశాల విద్యార్ధులు, సీనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని సిబిఐ కార్యాలయం నుంచి రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్‌ వరకూ ఆందోళన ప్రదర్శన చేపట్టారు. వారి ప్రతినిధుల బృందం వైద్య విభాగం అధికారులను కలిసారు. ప్రిన్సిపాల్‌ను తొలగించడం సహా పలు డిమాండ్లు చేసారు.

సందీప్‌ ఘోష్‌ను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. ఆయనను ఆర్.జి కర్ కళాశాల ప్రిన్సిపల్ పదవి నుంచి కలకత్తా కళాశాలకు బదిలీ చేయడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కోర్టులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంతో, మమత సర్కారుకు మరో దారి లేకపోయింది.

ఆగస్టు 9న ఆర్.జి.కర్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో 31ఏళ్ళ వైద్యురాలి మృతదేహం కనిపించడం, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యపరీక్షలో నిర్ధారణ అవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. విధి నిర్వహణలో ఉన్న హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ భద్రతకు తగిన చర్యలను సిఫారసు చేయడం ఆ టాస్క్‌ఫోర్స్ విధి.

మరోవైపు, కేసు విచారణలో కోల్‌కతా పోలీసుల పనితీరు సరిగ్గా లేదని ఆక్షేపిస్తూ కలకత్తా హైకోర్టు ఆ కేసును సిబిఐకి అప్పగించింది. కలకత్తా పోలీసులు ఒక పౌర వాలంటీరును అరెస్ట్ చేసారు, అంతకుమించి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దర్యాప్తు తాజా స్థితి మీద సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.

Tags: andhra today newsDoctor Rape and Murder CaseKolkataNew Principalrg kar hospitalSLIDERTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.