Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

భారత్ చేరుకున్న బంగ్లాదేశ్ తాజామాజీ ప్రధాని షేక్ హసీనా

అగర్తలా మీదుగా న్యూఢిల్లీకి!?

Ch Satish by Ch Satish
Aug 5, 2024, 05:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ మధ్యాహ్నం ఒక మిలటరీ హెలికాప్టర్‌లో భారతదేశం చేరుకున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి, ఆ వెంటనే భారత్‌కు బయల్దేరారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికార నివాసం నుంచి ఆమె బయల్దేరిన కొద్దిసేపటికే వేలమంది ఆందోళనకారులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు.

ప్రధాని అధికారనివాసం గణభవన్‌ నుంచి హసీనా ఈ మధ్యాహ్నం 2.30 సమయంలో మిలటరీ హెలికాప్టర్‌లో బయల్దేరారు. ఆమెతో పాటు ఆమె చెల్లెలు షేక్ రెహానా కూడా ఉన్నారు. వారు భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలా చేరుకునేసరికి అక్కడ ఢాకాలో ఆందోళనకారులు గణభవన్‌ను చుట్టుముట్టారు.

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కర్ఫ్యూను ధిక్కరించి వందల మంది విద్యార్ధులు రహదారుల మీదకు వచ్చారు. ఢాకా వరకూ లాంగ్ మార్చ్ మొదలుపెట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీచీఫ్ జనరల్ వాకర్ ఉస్ జమాన్ వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించారు.

బంగ్లాదేశ్‌లో కొద్దిరోజులుగా ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు తొలగించాలన్న డిమాండ్లతో విద్యార్ధిలోకం అట్టుడుకుతోంది. ఆగస్టు 4న ఆ ఆందోళనలు ఘర్షణల స్థాయికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం నుంచీ దేశమంతటా ఘర్షణలు రేగుతున్నాయి.

విద్యార్ధులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై టియర్ గ్యాస్ షెల్స్, స్టన్ గ్రెనేడ్స్ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా ఘర్షణల్లో 14మంది పోలీసులు మరణించారు. వారిలో 13మంది సిరాజ్‌గంజ్‌లోని ఎనాయత్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లోని వారే. 300మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ దేశంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. నిరవధిక కర్ఫ్యూ నడుస్తోంది. ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.

Tags: BangladeshIndiaMilitary HelicopterSheikh HasinaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.