Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

‘రామమందిరం తీర్పును మార్చివేయాలని రాహుల్ కోరుకున్నారు’

param by param
May 12, 2024, 10:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Rahul
wanted to overturn Ram Mandir Verdict, says Pramod Krishnam

రామజన్మభూమి కేసులో
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆ తీర్పును మార్చివేయాలని రాహుల్ గాంధీ
కోరుకున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామమందిరం గురించి సుప్రీంకోర్టు
ఇచ్చిన తీర్పును తిరగతోడి మార్పిస్తుందని రాహుల్ తమ పార్టీ వర్గాలకు చెప్పారట.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి
బహిష్కృతుడైన నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను
కాంగ్రెస్ పార్టీలో 32 సంవత్సరాలకు పైగా ఉన్నాను. రామమందిరం తీర్పు వచ్చినప్పుడు
రాహుల్ గాంధీ తన ఆంతరంగికులతో సమావేశంలో ఉన్నారు. అప్పుడాయన మాట్లాడుతూ కాంగ్రెస్
అధికారంలోకి రాగానే ఒక ప్రత్యేకమైన కమిషన్‌ను నియమించి రామమందిరం నిర్ణయాన్ని మార్చివేస్తామన్నారు.
షాబానో కేసు తీర్పును రాజీవ్ గాంధీ మార్చివేసినట్టే రామమందిరం కేసు తీర్పును కూడా
మార్చివేస్తామని రాహుల్ చెప్పారు’’ అని వివరించారు.

ఈ యేడాది జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనలేదు. అప్పటినుంచీ ఆచార్య
ప్రమోద్ కృష్ణమ్ తమ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఫిబ్రవరి
నెలలో ఆయనను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించారు.

ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రామమందిరం
విషయంలో పార్టీ నాయకత్వం నుంచి తాము ఎదుర్కొన్న సమస్యలను వెల్లడిస్తున్నారు.
తాజాగా మే 5న రాధికా ఖేరా అనే నాయకురాలు అదే విషయంలో పార్టీకి రాజీనామా చేసారు. ఏఐసీసీకి
రాసిన లేఖలో ఆమె, తనకు పార్టీలో జరిగిన అన్యాయం గురించి వివరించారు. కొద్దికాలం
క్రితం ఆమె అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. దాంతో ఆమెతో పార్టీ సహచరులే దుర్మార్గంగా
వ్యవహరించారు. ఆమెను గదిలో నిర్బంధించి, పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా చేసారు.
ఏఐసీసీకి రాసిన లేఖలో వాటి గురించి వివరిస్తూ రాధిక ‘‘ప్రాచీనకాలం నుంచీ ధర్మానికి
కట్టుబడి ఉన్నవారిని వ్యతిరేకించడం ఆనవాయితీగా వస్తోంది. హిరణ్యకశిపుడు
కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి లేదా కంసుడు కానివ్వండి… వారందరూ దానికి
ఉదాహరణలే. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది, భగవాన్ శ్రీరాముడి పేరును తలచుకునేవారిని
వ్యతిరేకిస్తున్నారు. శ్రీరామచంద్రప్రభువు జన్మస్థానం అంటే ప్రతీ హిందువుకూ ఎంతో
పవిత్రమైన స్థలం. రామచంద్రుణ్ణి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్లే అని ప్రతీ
హిందువూ భావిస్తారు. కానీ కొందరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు’’ అని రాసుకొచ్చారు.

అంతకు కొన్నాళ్ళ ముందు, ఏప్రిల్ 4న గౌరవ్ వల్లభ్
కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గేకు రాసిన లేఖలో గౌరవ్ వల్లభ్ ‘‘ఇప్పుడు కాంగ్రెస్ ఒక దశా దిశా లేకుండా
పయనిస్తున్న తీరుతో నేను సౌకర్యంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతనధర్మానికి
వ్యతిరేకంగా నినాదాలు చేయలేను. ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నవాళ్ళను దూషించలేను.
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికీ, పార్టీలో నాకు ఇచ్చిన అన్ని పదవులకూ రాజీనామా
చేస్తున్నాను’’ అని స్పష్టం చేసారు. రామమందిర ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్‌ దూరంగా
ఉండిపోవడం ‘పాపం’ అని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
పార్టీకి ఆహ్వానం వచ్చింది. దాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ విషయాన్ని నేను
ఒప్పుకోలేను. కూటమి నాయకులు సనాతన ధర్మం మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ విషయంలో
కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు? నేనిప్పుడు బీజేపీలో చేరుతున్నాను. భారతదేశాన్ని
ముందుకు తీసుకువెళ్ళడంలో నా సామర్థ్యాన్నీ, జ్ఞానాన్నీ సమర్థంగా వినియోగించాలని ఆశిస్తున్నాను’’
అంటూ గౌరవ్ వల్లభ్ రాసుకొచ్చారు. తాను నికార్సైన హిందువుని అని చెప్పుకుంటూ అయోధ్య
రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన మూడు నెలలకైనా ఆ మందిరాన్ని దర్శించుకోనందుకు రాహుల్
గాంధీని ఆయన విమర్శించారు.

Tags: AyodhyaGaurav VallabhPramod KrishnamPran PratishthaRadhika KheraRahul GandhiRam Mandir Verdict
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.