Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ఉండిలో ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏమిటి?

param by param
May 12, 2024, 10:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Undi Assembly Constituency Profile

ఈసారి
రాష్ట్రంలో ఆసక్తి కలిగించే నియోజకవర్గాల్లో ఉండి కూడా ముఖ్యమైనదే. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి
తరఫున గెలిచి, ఒక్క ఏడాదిలోపలే వైసీపీ రెబెల్‌గా తయారై, బహిరంగంగానే
తెలుగుదేశానికి మద్దతిస్తూ, అధికార పక్షం బనాయించిన కేసుల్లో పోలీసు దెబ్బలు తిని,
ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూలు విడుదల సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో
చేరి, ఇప్పుడు పచ్చజెండా చేతపుచ్చుకున్న కనుమూరు రఘు రామకృష్ణ రాజు అలియాస్
ఆర్ఆర్ఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అది.

నిజానికి
ఆరారార్‌కు సీటు కేటాయించే విషయంలో చివరివరకూ తీవ్ర సందిగ్ధతే నెలకొంది. ఆయన
నరసాపురం లోక్‌సభా స్థానం ఆశించారు. పొత్తు లెక్కల్లో నరసాపురం స్థానాన్ని
బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఆ పార్టీలో చేర్పించి, రఘు రామకృష్ణ రాజుకు
బీజేపీ టికెట్ ఇప్పిద్దామని భావించారు. కానీ దానికి కమలం పార్టీ ఒప్పుకోలేదు. ఆ
పార్టీ తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మకు స్థానం దక్కింది. దాంతో ఆరారార్‌కు నిరాశే
మిగిలింది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ
పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
బీజేపీ ఎంతకూ తగ్గలేదు. దాంతో, జగనే బీజేపీని ప్రభావితం చేసి తనకు టికెట్
ఇవ్వకుండా ఆపించారంటూ రఘు రామకృష్ణ రాజు ఆరోపించారు కూడా.

చంద్రబాబు ఎట్టకేలకు
ఆరారార్‌ను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉండి నియోజకవర్గంలో తమ అభ్యర్ధి మంతెన
రామరాజును తప్పించి, రఘురామను నిలబెట్టారు. ఆ పరిణామంతో మంతెన కొంత ఉద్వేగానికి
లోనయ్యారు. నిజానికి మొదటి విడతలోనే తన పేరు ప్రకటించడంతో ముందుగానే ప్రచారం మొదలుపెట్టేసుకున్న
మంతెన రామరాజు, అభ్యర్ధి మార్పిడితో నిరాశకు గురయ్యారు. ఆరారార్‌కు టికెట్
ఇస్తారనే వార్తల నేపథ్యంలో రామరాజు అనుచరులు ఉండిలో నిరసనలు సైతం చేపట్టారు. అయితే
చంద్రబాబు మొత్తం మీద రామరాజును ఒప్పించగలిగారు.

పశ్చిమగోదావరి
జిల్లాలోని ఉండి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి కాళ్ళ, పాలకోడేరు, ఉండి, ఆకివీడు, భీమవరం.

ఉండిలో ప్రధానంగా
కాంగ్రెస్, టిడిపిల హవాయే నడిచింది. 1952, 1955, 1962 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్
గెలిచింది. 1967లోనూ, 1970లో జరిగిన ఉపయెన్నికలోనూ స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1972,
1978 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ఇక 1983 నుంచి 2019 వరకూ జరిగిన
అన్ని ఎన్నికల్లోనూ అన్నిసార్లూ తెలుగుదేశమే గెలిచింది. మధ్యలో 2004లో ఒక్కసారి
కాంగ్రెస్ ఉనికి చాటుకుంది.

2019 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధి మంతెన రామరాజు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి పివిఎల్ నరసింహరాజుపై
గెలిచారు. ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి మళ్ళీ నరసింహరాజునే నిలిపింది. ఎన్‌డిఎ
కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కనుమూరు రఘు రామకృష్ణ రాజు పోటీ చేస్తున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా వేగేశ వెంకట గోపాలకృష్ణం బరిలో నిలిచారు.

Tags: TDPUndi ACYSRCP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.