Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

డ్రగ్స్‌తో నిండిఉన్న పాకిస్తానీ పడవను పట్టుకున్న భారత్

param by param
May 12, 2024, 08:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Indian Coast Guard apprehended a Pakistani Boat with drugs

అరేబియా సముద్ర ప్రాదేశిక జలాల్లో అనుమానాస్పదంగా
సంచరిస్తున్న ఒక పడవను భారత అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఆ
పడవలో పెద్దమొత్తంలో డ్రగ్స్ ఉన్నాయి. ముందుగా అందిన సమాచారంతో వలవేసి ఆ పడవను
నిర్బంధించి, అందులో ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసారు.

భారతీయ తీరరక్షక దళం ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు
అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ప్రకారం ఆ ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు
350 కిలోమీటర్ల దూరంలో, అరేబియా సముద్రంలో పడవ ఉందని గుర్తించారు. నార్కోటిక్స్ కంట్రోల్
బ్యూరో, గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఆ పడవలో సుమారు 480 కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు దొరికాయి.   

సోమవారం రాత్రి నుంచే కోస్ట్‌గార్డ్ దళాలు తమ
ఓడలను అరేబియా సముద్రంలో వ్యూహాత్మకంగా మోహరించాయి. మాదకద్రవ్యాల పడవ ఎక్కడుందో
కనుగొనడం కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియే ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ప్రాంతం
మొత్తాన్నీ స్కాన్ చేసింది. కోస్ట్‌గార్డ్ ఓడలు, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్
బృందం, గుజరాత్ ఏటీఎస్ బృందం జాగ్రత్తగా సముద్రాన్ని పరిశీలిస్తూ చీకటిలో
అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను గుర్తించారు. కోస్ట్‌గార్డ్ ఓడలు ఆ పడవను
ఆగిపొమ్మని ఆదేశించినా, అందులోని వారు తప్పించుకుని పారిపోడానికి ప్రయత్నించారు.
దాంతో సంయుక్త బృందాలు ఆ పడవను వెంటాడి వేటాడి నిలువరించాయి. బోర్డింగ్ టీమ్
వెంటనే ఆ పడవ మీదకెక్కి తనిఖీలు చేపట్టింది.  

ఆ పడవ పాకిస్తానీ పడవ అని స్పష్టంగా వెల్లడైంది.
అందులో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బోర్డింగ్ టీమ్ ఆ పడవను క్షుణ్ణంగా శోధించి,
అందులో సుమారు 480కోట్ల రూపాయల విలువైన 80కేజీల మాదకద్రవ్యాలు ఉన్నాయని కనుగొంది.
ఆ పడవను పోర్‌బందర్ ‌తీరానికి తీసుకొచ్చారు, అందులోని వారిని అరెస్ట్ చేసారు.

కోస్ట్‌గార్డ్, ఎన్‌సీబీ, గుజరాత్ ఏటీఎస్‌ బృందాల
సంయుక్త కృషితో ఇలాంటి పడవలను నిర్బంధించడం గత మూడేళ్ళలో ఇది పదోసారి. ఈ మూడేళ్ళలోనూ
ఇప్పటివరకూ రూ.3135 కోట్ల విలువైన 517 కేజీల మాదక ద్రవ్యాలు పాకిస్తాన్ నుంచి
భారత్‌కు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డాయి.

 

Tags: Arabian SeadrugsGujarat ATSIndian Coast GuardNarcotics Control BureauPakistani Boat
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.