Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

రామయ్యను చూడడానికి పోటెత్తిన జనసంద్రం

param by param
May 12, 2024, 02:39 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Lakhs of devotees throng Ram Mandir since early morning 

శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశీ తిథి అభిజిత్ లగ్నంలో భవ్యమందిరంలో బాలరాముడు
సర్వాంగసుందరంగా విరాజమానుడయ్యాడు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇక ఈనాటి నుంచీ
సాధారణ భక్తులకు ప్రత్యక్ష దర్శన భాగ్యం ప్రారంభమయింది.

అయోధ్యలోని అన్ని వీధులూ బాలరాముడి మందిరానికే
దారితీస్తున్నాయి. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, కోదండపాణి అయిన రామయ్యను
దర్శించుకోడానికి అశేష ప్రజావాహిని పోటెత్తుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచే
ఆలయం దగ్గర భక్తజనసంద్రం పోటెత్తింది. అంత చలిలోనూ సరయూ నదిలో పుణ్యస్నానాలు
ఆచరించి తమ రామయ్యను చూసుకోడానికి పరుగులు తీసారు.

సోమవారం అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
ఎంపిక చేసిన కొన్నివేలమంది అతిథులు మాత్రం హాజరయ్యారు. కేంద్రమంత్రులు, రాష్ట్రాల
ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ రాజకీయ నాయకులు తమతమ ప్రదేశాల్లోనే ఉండి స్థానిక
రామాలయాల్లో పూజలు చేసారు, అక్కడినుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి
తరించారు. ఇక ఈరోజు నుంచీ సాధారణ ప్రజలకు దర్శనమిస్తున్నాడు బాలరాముడు.

‘‘అయోధ్యా నగరం పెళ్ళికూతురిలా ముస్తాబయింది. మా
ఆనందానికి అవధులు లేవు. ఇవాళ రామ్‌లల్లాను దర్శించుకుంటామన్న ఆలోచనతో ఒళ్ళు
గగుర్పొడుస్తోంది. మనసంతా ఉద్వేగంతో ఉప్పొంగుతోంది’’ అని చండీగఢ్ నుంచి వచ్చిన
తేజీందర్ సింగ్ అనే భక్తుడు తన మనసులోని భావాలను వ్యక్తీకరించాడు. ‘‘లక్షల మంది
భక్తులు రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇంత సందడి’’ అంటూ అక్కడి
పరిస్థితిని వర్ణించాడు.

ఒడిషాకు చెందిన మరో భక్తుడు పూరీ జగన్నాథ
క్షేత్రం నుంచి అయోధ్యకు చేరుకున్నాడు. ‘‘రామ్‌లల్లాను దర్శించుకోడానికి పూరీ
నుంచి మోటార్ సైకిల్ మీద మొత్తం 1224 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాను.
రాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని తహతహలాడుతున్నాను. దారిలో నన్ను
కొందరు ఎక్కడికి వెడుతున్నావని అడిగారు. ఐదువందల యేళ్ళుగా కట్టకుండా ఉండి ఇప్పటికి
నిర్మాణమైన భవ్యమందిరంలో రామయ్యను దర్శించుకోడానికి వెడుతున్నాను అని వాళ్ళకు
చెప్పాను. మరికొద్దిసేపట్లో నా తండ్రిని చూస్తాను’’ అంటూ ఆనంద పరవశుడయ్యాడు.

భవ్య రామమందిరం పరిసర
ప్రాంతాల్లో పటిష్ట భద్రత కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అవాంతరాలూ కలక్కుండా దర్శనాలకు
ఏర్పాట్లు చేసారు. అంతకుముందు, గతరాత్రి అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం నిర్వహించారు.

Tags: AyodhyaConsecrationGeneral DevoteesRam DarsanRam Lalla
ShareTweetSendShare

Related News

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
general

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి
general

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.