Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

బిహార్‌ కులగణన: 34శాతం జనాభా ఆదాయం రూ.6వేల లోపే

param by param
May 11, 2024, 07:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Bihar caste survey
report second tranche

బిహార్ కులగణన నివేదిక రెండో భాగాన్ని
ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టారు. ఈ రెండో విడత నివేదికలో రాష్ట్రంలోని
215 షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన
తరగతుల వారి ఆర్థిక స్థితిగతులను ప్రకటించారు.

నివేదికలోని వివరాల ప్రకారం ఎస్సీ,
ఎస్టీల్లో 42శాతానికి పైగా ప్రజలు… బీసీలు, ఈబీసీల్లో 33శాతానికి పైగా పేదరికంలో
మగ్గుతున్నారు. ఎస్సీల్లో 12వ తరగతి పూర్తి చేసినవాళ్ళు 6శాతం కంటె తక్కువ.

ఈ నివేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్
షా ఆరోపణలు చేసారు. బిహార్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యాదవులు, ముస్లిముల జనాభాను
ఎక్కువ చేసి చూపడం ద్వారా ఈబీసీల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. బిహార్
ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘యాదవులు
వెనుకబడినవారు కాదా? శాస్త్రీయ గణాంకాలను తప్పుల తడకలు అని ఎలా అంటారు?’’ అని
మండిపడ్డారు.

గతనెల విడుదల చేసిన మొదటి విడత కులగణన సమాచారం
ప్రకారం బిహార్ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు బీసీలు, ఈబీసీలున్నారు. 20శాతానికి
పైగా జనాలు ఎస్సీ ఎస్టీలున్నారు.

 

ఆర్థిక సమాచారం

 

బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రెండో
విడత సమాచారం ప్రకారం… 13.1కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 34.13 శాతం కుటుంబాలకు
ఆదాయం రూ.6వేల కంటె తక్కువే. రాష్ట్రంలో 29.61శాతం మంది రూ.10వేల కంటె తక్కువ
ఆదాయంతో బతుకుతున్నారు. సుమారు 28శాతం రూ.10వేల నుంచి రూ.50వేల మధ్య ఆదాయంతో
జీవిస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఎస్సీల్లో 42.93శాతం
కుటుంబాలు, ఎస్టీల్లో 42.70శాతం కుటుంబాలు, బీసీల్లో 33.16శాతం కుటుంబాలు,
ఈబీసీల్లో 33.58శాతం కుటుంబాలూ పేదరికంలో మగ్గుతున్నాయి. జనరల్ కేటగిరీలో కేవలం
25.09శాతం మంది పేదవారున్నారు. అందులో 25.32శాతం మంది భూమిహార్‌లు, 25.3శాతం
బ్రాహ్మణులు, 24.98శాతం మంది రాజ్‌పుత్‌లు పేదలుగా ఉన్నారు. బిహార్ జనాభాలో
బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు కలిపి 7.11శాతం జనాభా ఉన్నారు, అలాగే భూమిహార్‌లు
2.86శాతం జనాభా ఉన్నారు.

ఇక బీసీల విషయానికి వస్తే, యాదవుల్లో 35.87శాతం
మంది, కుశ్వాహాల్లో 34.32శాతం మంది, కుర్మీల్లో 29.9శాతం మంది పేదలు ఉన్నారని తాజా
కులగణన చెబుతోంది. బిహార్ జనాభాలో యాదవులు 14.26శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలోని
ఓబీసీల్లో యాదవుల జనసంఖ్యే ఎక్కువ. మిగతా ఓబీసీలు 8శాతం కంటె కొంచెం ఎక్కువ.  

ఈబీసీల్లో సగటున 30శాతానికి పైగా కుటుంబాలు
పేదరికంలో ఉన్నాయి. వివరంగా చూస్తే… తేలీల్లో 29.87శాతం, కానూల్లో 32.99శాతం,
చంద్రవంశీల్లో 34.08శాతం, ధనుక్‌లలో 34.75శాతం, నోనియాల్లో 35.88శాతం పేదరికంలో
మగ్గుతున్నారు.

 

బిహార్‌లో అక్షరాస్యత

 

బిహార్‌లో మొత్తం అక్షరాస్యత 79.7శాతం
ఉంది. ఐదో తరగతి వరకూ చదువుకున్నవాళ్ళు 22.67శాతం మంది ఉన్నారు. ఎస్సీల్లో ఐదో
తరగతి వరకూ చదువుకున్నవారు 24.31శాతం కాగా ఈబీసీల్లో 24.65శాతం మంది ఉన్నారు. ఇక
జనరల్ కేటగిరీలో ఐదో తరగతి వరకూ చదువుకున్నవారు 17.45శాతం మంది మాత్రమే.

ఎస్సీల్లో 11, 12 తరగతుల వరకూ చదువుకున్న
వారు 5.76శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా కులాలు అన్నింటిలో కలిపి 9శాతం మంది
11, 12 తరగతుల వరకూ చదువుకున్నారు.


బిహార్ కులగణన మొదటి నివేదిక విడుదలైన
తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి
ఇవాళ్టి నుంచీ మొదలైన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల
నేపథ్యంలో కులగణన డిమాండ్లు పెరిగాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో
కులగణన డిమాండ్ల పట్ల పెద్ద సానుకూలంగా లేదు. అయితే ఈ విషయమై ఈ వారంలో విధానపరమైన
నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనప్రాయంగా చెప్పారు.
తమ పార్టీ కుల గణనను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఆ విషయమై తగిన చర్చలు సంప్రదింపులు
జరగాల్సిన అవసరాన్ని మాత్రమే ప్రస్తావించామనీ ఆయన చెప్పారు.

బిహార్ కులగణన మొదటి దశ
నివేదిక విడుదలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీష్ సర్కారుపై
విరుచుకుపడ్డారు. దేశాన్ని కులాల పేరిట విభజించడానికి ప్రయత్నిస్తున్నారంటూ
దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో
కులగణన జరిపిస్తామనీ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే
దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ చెప్పారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.