Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

Ghulam Nabi Azad: భారత్‌లో ముస్లిములందరూ ఒకప్పుడు హిందువులే

param by param
May 11, 2024, 04:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ మాజీ
నేత, కశ్మీర్‌కు చెందిన నాయకుడు గులామ్ నబీ ఆజాద్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు.
భారతదేశంలో ఉన్న ముస్లిములందరూ గతంలో హిందువులేననీ, మతం మార్చబడిన తర్వాతే
ముస్లిములయ్యారనీ వ్యాఖ్యానించారు.

డెమొక్రటిక్
ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యవస్థాపక నేత గులామ్ నబీ ఆజాద్ దోడా జిల్లా తాత్రీ
ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ హిందూ, ఇస్లాం మతాల
గురించి వ్యాఖ్యలు చేసారు. ‘‘కశ్మీర్ ఉదాహరణే తీసుకోండి. 600 సంవత్సరాల క్రితం
కశ్మీర్‌లో ముస్లిములు లేరు. కశ్మీరీ పండిట్లను ముస్లిములుగా మతమార్పిడి చేసారు.
ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా అంతే. ఇస్లాం మతం పుట్టి 1500 సంవత్సరాలే
అయింది. హిందూమతం అంతకంటె చాలా పురాతనమైనది’’ అన్నారు.

భారతదేశంలో
ఇస్లాం ప్రవేశం, వ్యాప్తి గురించి కూడా ఆజాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
‘‘భారత్‌లోకి ఇస్లాం బైటనుంచే వచ్చి ఉండాలి. మొగలు సైన్యంలో పదిమందో ఇరవై మందో ముస్లిములు
ఉండేవారు. మిగిలినవారంతా హిందూమతం లేక సిక్కుమతం నుంచి నుంచి మార్చబడిన వారే’’
అన్నారు. గులామ్ నబీ ఆజాద్ ఆగస్ట్ 14న మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

‘‘ఈ గడ్డ హిందువులు,
ముస్లిములు, దళితులు, కశ్మీరీలు అందరిదీ. ఇది మన భూమి. మనమెవ్వరమూ బైటనుంచి
రాలేదు. నేను పార్లమెంటులో చాలా విషయాలు చూసాను. అవి మీవరకూ రావు. మన దేశంలో కొందరు
బైటనుంచి వచ్చినవారని, ఒక సహచర బీజేపీ ఎంపీ అన్నారు. నేను దాన్ని ఖండించాను.
బైటివారా లోపలివారా అన్నది కాదు విషయం. ఇస్లాం వయసు కేవలం 1500 సంవత్సరాలు.
హిందూమతం అంతకంటె చాలా పురాతనమైనది. మొగలుల కాలంలో వారి సైన్యంలో ఉన్న ఓ 10 లేదా
20మంది ముస్లిములు మాత్రం బైటనుంచి భారతదేశానికి వచ్చి ఉంటారు. ఈ దేశంలోని మిగతా
ముస్లిములంతా హిందూమతం నుంచి మార్చబడినవాళ్ళే. కశ్మీరే దానికి పెద్ద ఉదాహరణ’’ అని
గులామ్ నబీ ఆజాద్ వివరించారు.

‘‘మనందరి సమష్టి
వారసత్వానికి మూలాలు హిందూమతంలో ఉన్నాయి. మనని మనం హిందువులుగానో, ముస్లిములుగానో,
రాజపుత్రులుగానో, బ్రాహ్మణులుగానో, దళితులుగానో, కశ్మీరీలుగానో, లేక గుజ్జర్లుగానో
చెప్పుకోవచ్చు. మనందరినీ కలిపి ఉంచే సూత్రం ఒకటుంది. అదే ఈ దేశం. మన పూర్వీకులు ఈ
భూమికి చెందినవారు. మనందరం ఇక్కడికి చేరవలసిన వాళ్ళమే’’ అని ఆజాద్
వ్యాఖ్యానించారు.

‘‘అసలు 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ముస్లిం
ఎవరున్నారు? అందరూ కశ్మీరీ పండిట్లే. వాళ్ళందరూ ఇస్లాంలోకి మారారు. అందుకే అందరూ హిందూమతంలోనే
పుట్టారు అన్నాను’’ అని చెప్పుకొచ్చారు గులామ్ నబీ ఆజాద్.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.