Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home వాతావరణం, పర్యావరణం

Himachal Floods : వదలని వరదలు, 60కు చేరిన మృతుల సంఖ్య

param by param
May 11, 2024, 04:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. గడచిన మూడు రోజుల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 60 మంది చనిపోయారు. అతి భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడి హిమాచల్‌ప్రదేశ్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా సమ్మర్ హిల్‌, క్రిష్ణనగర్, ఫగ్లీతో పాటు రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సమ్మర్ హిల్‌లో కొండచరియలు విరిగిపడి అనేక మంది చిక్కుకుపోయారు. విరిగిపడిన కొండచరియల నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. ఫగ్లీ, క్రిష్ణానగర్‌లో ఐదు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.

నిన్న సాయంత్రం సిమ్లాలో కురిసిన కుండపోత వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. సోలన్ జిల్లాలో కుండపోత వర్షాలకు ఏడుగురు చనిపోయారు. 800 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు హిమాచల్ సీఎం సుఖ్‌వీందర్‌సింగ్ చెప్పారు. వరద బాధితులను హెలికాఫ్టర్ల ద్వారా రక్షిస్తున్న విజువల్స్‌ను సీఎం సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరదలకు రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది, సాధ్యమైనంత త్వరగా యుద్ధప్రాతిపదికల పునరుద్దరణ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆగష్టు 19 వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

వరదలతో ఇప్పటికే 800 రహదారులు మూసుకుపోయాయని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ ఏడాది రెండు సార్లు ముంచెత్తిన వరదలకు వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి, తగిన సాయం చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. 

ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.